అశ్వాపురం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో పందుల సంచారం రోజురోజుకూ పెరుగుతుండటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పందులు వీధుల్లో తిరుగుతూ చెత్తను చెల్లాచెదురు చేయడంతో కాలనీలో దుర్వాసన వెదజల్లుతోంది.
వర్షాకాలం కావడంతో పరిస్థితి మరింత దిగజారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసనతో పాటు అపరిశుభ్ర వాతావరణం కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారని పంచాయతీ సెక్రెటరీ యాకుబ్ ,అశ్వాపురం సర్పంచ్ సోదరులాల్ లకు వినతి పత్రం అందజేసి
ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. వెంటనే స్పందించి పందుల బెడదను నివారించడంతో పాటు కాలనీలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి ప్రజలకు ఉపశమనం కల్పించాలని వారు అధికారులను కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కాలనీవాసులు గొల్లపల్లి నరేష్ కుమార్, ఈనపల్లి పవన్ సాయి, ఇసంపల్లి ప్రసాద్, గరాటి రాంబాబు, కనుకు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
0 కామెంట్లు