ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామంలో లబ్ధిదారు సనపా రుబికా నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రుబికాకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల సొంతింటి కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
0 కామెంట్లు