నాగర్కర్నూల్, జూలై 2 (ఎస్బి న్యూస్): నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శుక్రవారం పర్యటించనున్నారు.
పర్యటనలో భాగంగా ఉదయం 10:30 గంటలకు ఎల్మపల్లి గ్రామంలో, 11:00 గంటలకు ఈదులబావి గ్రామంలో మహిళా సంఘం కార్యాలయాల భూమిపూజ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అనంతరం 11:30 గంటలకు అమ్రాబాద్లోని ఎంకే గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ రాజు వివాహ వేడుకకు హాజరవుతారు.
మధ్యాహ్నం 12:30 గంటలకు బీకే లక్ష్మాపూర్ గ్రామంలో నూతన ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి పరిశీలించనున్నారు.
ఈ కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు.
0 కామెంట్లు