అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన ఓరుగంటి రమేష్ బాబు నూతన అధ్యక్షున్ని ఘనంగా సన్మానించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం (ఓరుగంటి వీరయ్య గారి భవన్) కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా మండల అధ్యక్షుడిగా ఎన్నికైన ఓరుగంటి రమేష్ బాబుని ఘనంగా సన్మానించి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలియజేసిన అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు మాట్లాడుతూ... తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు తోట లక్ష్మీ ప్రసన్న గారికి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారికి తనను అభినందించిన నాయకులు, కార్యకర్తలకు మరియు శ్రేయోభిలాషులందరికీ నూతన మండల అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల ఆశయాలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊస అనిల్ కుమార్,యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్స్ గొల్లపల్లి నరేష్ కుమార్, వేముల విజయ్,తాటి రాంబాబు, సోడే వెంకటేశ్వర్లు, సోడే నరసింహారావు, తాటి శ్రీను, కాసర్ల నరసయ్య, ఎస్ కే మేహారాజ్, వెంకటాపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు