గుండాల టూ కొడవటంచ లో లెవల్ బ్రిడ్జిని పునరుద్దరించాలి

గుండాల టూ కొడవటంచ లో లెవల్ బ్రిడ్జిని పునరుద్దరించాలి


గుండాల మండలం జూన్ 19 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి

 ప్రజల సౌకర్యర్థం లో లెవల్ బ్రిడ్జి శిథిలావస్థలోకి పోయింది. ప్రభుత్వం తక్షణమే ఈ బ్రిడ్జిని పునరుద్ధరించాలని రైతు కూలి సంఘం డిమాండ్ చేసింది. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం గుండాలలో లోలెవల్ బ్రిడ్జిని తక్షణమే నిర్మించాలి. బ్రిడ్జి లో లెవెల్ కుంగడం వల్ల ప్రజలకు రవాణా సౌకర్యం అసౌకర్యంగా మారింది ప్రజల ఇక్కట్లను బాధలను స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు విస్మరించాల అనడంలో సందేహం లేదు కేవలం ప్రజలను ఓట్ల పెట్టెలోనే చూస్తున్నారు. ఎన్నికల్లో ప్రభుత్వాలు ఇచ్చిన ఏ హామీ కూడా కాగితాలను దాటి బయటికి రాలేదు, అమలు కాలేదు. గుండాల ప్రాంతంలో ప్రజల ప్రజల అవసరార్థం గతంలో నిర్మించిన ఈ బ్రిడ్జిని పునర్నిర్మానం చేయకపోతే రైతు కూలి సంఘం మరియు ఏఐఎస్టియు ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయ దిగ్బంధనం చేస్తామని రైతు కూలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోకాళ్ళ సమ్మయ్య, ఏఐఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోల్ల అంజయ్యలు గుండాల లోని లో లెవెల్ బ్రిడ్జి సందర్శించినారు. ఈ కార్యక్రమంలో సత్యం, రమేష్, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు