నాగర్కర్నూల్, జూన్ 20 (ఎస్బీ న్యూస్): బీసీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం అమలు చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి డిమాండ్ చేశారు. శనివారం నాగర్కర్నూల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉన్నత విద్యను అభ్యసిస్తున్న బీసీ విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువులకు దూరం కాకుండా ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించాలని కోరారు. అలాగే ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని అన్నారు.
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
#BCStudents
#FeeReimbursement
#Scholarships
#BCJAC
#AravindChari
#Nagarkurnool
#StudentRights
#EducationSupport
#TelanganaStudents
#BCWelfare
#EducationNews
#TelanganaNews
#SBNews
#LocalNews
#BreakingNews
0 కామెంట్లు