-న్యాయవాది కర్నే రవి పిలుపు
మణుగూరు, జూన్ 28 (ఎస్బీ న్యూస్):
పినపాక నియోజకవర్గంలోని ఐదు సంవత్సరాల లోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని మణుగూరు గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నే రవి పిలుపునిచ్చారు.
ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన మాట్లాడుతూ, "నిండు జీవితానికి రెండు చుక్కలు" అనే నినాదాన్ని ప్రతి కుటుంబం గుర్తుంచుకోవాలని సూచించారు. ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో వంటి ప్రమాదకరమైన వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు.
పోలియో కారణంగా వచ్చే అంగవైకల్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసిందని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.
పినపాక నియోజకవర్గ ప్రజలందరూ వైద్య, ఆరోగ్య సిబ్బందికి పూర్తి సహకారం అందించి, ఐదు సంవత్సరాల లోపు ఒక్క చిన్నారి కూడా మిగలకుండా పల్స్ పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కర్నే రవి విజ్ఞప్తి చేశారు.
0 కామెంట్లు