లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం – 8 గంటల పని హక్కు కాపాడాలి: సీఐటీయూ

లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం – 8 గంటల పని హక్కు కాపాడాలి: సీఐటీయూ
ఆదోని: 140వ మేడే సందర్భంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలో జెండా ఆవిష్కరణలు, ర్యాలీలు నిర్వహించారు. సీఐటీయూ కార్యాలయం నుంచి భీమా సర్కిల్ మీదుగా రెవెన్యూ భవనం వరకు ర్యాలీ చేపట్టి అనంతరం సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, చికాగో కార్మికుల పోరాట ఫలితంగా సాధించిన 8 గంటల పనిదినాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక హక్కులకు విరుద్ధమని విమర్శించారు. కార్మిక చట్టాలను బలహీనపరిచి, వేతనాలు తగ్గించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు అంజిబాబు, ఈరన్న, తిప్పన్న, లక్ష్మన్న, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు