ఆదోని: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఉల్లిగడ్డల వీరన్న చౌరస్తా వద్ద నిర్వహించిన మేడే సభ విజయవంతమైంది. ఈ సందర్భంగా ఏఐఎఫ్టీయూ నాయకులు మాట్లాడుతూ, లేబర్ కోడ్లు, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
1886 మే 1న అమెరికాలోని చికాగో హే మార్కెట్ ఘటనలో కార్మికులు చేసిన త్యాగాలతో 8 గంటల పనిదినం సాధించుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం భారత్లో కొన్ని చోట్ల 10-12 గంటల పని విధానం అమలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పీవోডబ్ల్యూ రాష్ట్ర కన్వీనర్ సుజ్ఞానమ్మ, ఏఐఎఫ్టీయూ నాయకులు లక్ష్మన్న, సుభాష్ చంద్రబోస్, నాగరాజు, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్లు