భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవి పల్లి మండలం దూదియా తండా గ్రామపంచాయతీకి చెందిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సుమారు 70 సంవత్సరాలుగా నివసిస్తున్న ఈ గ్రామంలో మూడు తండాలు కలిపి దాదాపు 200 గృహాలు, 1200 పైచిలుకు జనాభా జీవనం సాగిస్తున్నారు.
రోజువారీ కూలి పనులపై ఆధారపడిన ఈ ప్రజలు నివాస సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇల్లు పథకంను పైలెట్ ప్రాజెక్టుగా తమ గ్రామంలో అమలు చేయాలని కోరుతున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న L1, L2, L3 జాబితాల్లో మార్పులు చేర్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గ్రామపంచాయతీని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్, ITDA POలకు గ్రామ ప్రజలు విన్నవించారు.
ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు పథకం ప్రయోజనం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయాన్ని దూదియా తండా గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ గుగులోత్ నరేష్ తెలిపారు.
#దూదియా_తండా #ఇందిరమ్మఇల్లు #భద్రాద్రికొత్తగూడెం #లక్ష్మీదేవిపల్లి #గ్రామఅభివృద్ధి #పేదలకోసం #హౌసింగ్పథకం #తెలంగాణ #గ్రామసమస్యలు #YouthVoice #sbnews
0 కామెంట్లు