చరిత్ర పుటల్లో శాశ్వత విజేత అంబేద్కర్

చరిత్ర పుటల్లో శాశ్వత విజేత అంబేద్కర్
-మణుగూరులో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం మణుగూరు ప్రజాభవన్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు పీరినాకి నవీన్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రజాభవన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు డీజే తో ఊరేగింపుగా వెళ్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్, జనరల్ సెక్రటరీ చెరుకుపల్లి దుర్గారావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పీరినాకి నవీన్ మాట్లాడుతూ,
డాక్టర్ అంబేద్కర్ అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడని పేర్కొన్నారు. అంటరానితన నిర్మూలన, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి సమానత్వాన్ని స్థాపించేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.

భారత రాజ్యాంగ రూపకర్తగా ప్రతి పౌరునికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం సాధనలో ఆయన చూపిన మార్గం అందరికీ ఆదర్శమని అన్నారు.

అంబేద్కర్ జయంతి సందర్భంగా రాజ్యాంగాన్ని కాపాడుతూ సమాజంలో అసమానతలను నిర్మూలించేందుకు ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో చింతల కృష్ణ, రవి, నానాజీ, గోల్డ్ రవి, సీతయ్య తదితరులు పాల్గొన్నారు.


#AmbedkarJayanti #DrBRAmbedkar #Manuguru #Pinapaka #BhadradriKothagudem #SocialJustice #Equality #IndianConstitution #CongressParty #TelanganaNews

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు