పినపాక మండలం ఐలాపురం గ్రామంలో ఉన్న కస్తూరిబా బాలికల పాఠశాలను తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హాస్టల్ సౌకర్యాలు, విద్యార్థినుల వసతి, ఆహార నాణ్యత, పరిశుభ్రత తదితర అంశాలను సమీక్షించారు. సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థినులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని అన్నారు.
0 కామెంట్లు