కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో తహసీల్దార్, ఎంపీఓలకు సన్మానం

కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో తహసీల్దార్, ఎంపీఓలకు సన్మానం 
పినపాక: పినపాక మండల కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ జి. శ్రీనివాస్ రెడ్డిని, అలాగే ఎంపీఓగా విధులు నిర్వర్తిస్తూ అదనపు బాధ్యతగా ఎంపీడీఓ గా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లును కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పినపాక కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోర్స ఆనంద్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు అధికారులను కలిసి శాలువాలు కప్పి అభినందనలు తెలియజేశారు. అనంతరం వారు మండల అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. పినపాక మండలం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనించేలా అధికారులు చొరవ చూపాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో తోగ్గుడెం పంచాయతీ ఉప సర్పంచ్ అచ్చ నవీన్, జిల్లా సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ కోడిరెక్కల సాయికుమార్, పాడి హేమంత్ రెడ్డి, చిట్టిమళ్ళ ప్రసాద్, గిద్దె వరుణ్, కొప్పుల రామ్ గోపాల్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు