నర్సరీల్లో నాణ్యమైన, మేలురకమైన మొక్కలను పెంచి ప్రజలకు అందుబాటులో ఉంచాలని అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) రమణ సూచించారు. సోమవారం ఆయన పినపాక మండలంలో పర్యటించి స్థానిక ఎంపీడీవో వెంకటేశ్వరరావుతో కలిసి పలు గ్రామ పంచాయతీల నర్సరీలను పరిశీలించారు.ఈ సందర్భంగా భూపాలపట్నం, బోటిగూడెం, ఉప్పక, సీతంపేట గ్రామాల నర్సరీలను సందర్శించి మొక్కల పెంపకం, సంరక్షణ, పంపిణీ విధానాలపై సమగ్రంగా పరిశీలించారు. నర్సరీల్లో మొక్కల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రజలకు అందించే మొక్కలు ఆరోగ్యవంతంగా, పర్యావరణానికి అనుకూలంగా ఉండాలని సూచించారు.
ప్రతి గ్రామంలో పచ్చదనం పెంపొందించడంలో నర్సరీల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలు నర్సరీలను సక్రమంగా నిర్వహించి, అవసరమైన మొక్కలను సమయానికి అందించాలని ఆదేశించారు. మొక్కల పెంపకంలో సాంకేతిక పద్ధతులు అనుసరించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీఓ వీరభద్ర స్వామి , భూపాలపట్నం సర్పంచ్ స్వప్న, ఉప్పాక సర్పంచ్ బాబురావు, బోటు గూడెం సర్పంచ్ బాపనమ్మ, సీతంపేట సర్పంచ్ శివశంకర్,సెక్రటరీలు అరుణ శ్రీ, చంద్రశేఖర్, అశోక్ కుమార్, జ్యోతి, బోటిగూడెం ఉపసర్పంచ్ కొమరం ధన లక్ష్మి,గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
0 కామెంట్లు