మణుగూరు: పట్టణంలో ఇటీవల గ్రూపులుగా ఏర్పడి చోటు చేసుకుంటున్న ఘర్షణల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై శ్రావణ్ కుమార్ సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఎక్కడైనా గొడవలు, అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఆటో డ్రైవర్లు, వాహనదారులు, యువత మరియు ప్రజలు చట్టాన్ని గౌరవించి సహకరించాలని ఆయన తెలిపారు. చిన్నపాటి వివాదాలను పెద్ద గొడవలుగా మార్చకుండా నియంత్రించుకోవాలని, సమాజంలో శాంతి నెలకొల్పడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పోలీసులు ప్రజల సహకారంతోనే శాంతి భద్రతలను కాపాడగలరని పేర్కొన్నారు.
0 కామెంట్లు