మట్టి ట్రాక్టర్లపై మున్సిపాలిటీ అధికారుల చర్య

 

మణుగూరు చెరువు పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా అక్రమంగా మట్టి తవ్వకాలు నిర్వహిస్తూ బయటకు విక్రయిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ అక్రమ కార్యకలాపాల వల్ల సిమెంటు రోడ్లు మట్టితో నిండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకుని రెండు మట్టి ట్రాక్టర్లను పట్టుకున్నారు. అక్రమ మట్టి తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

స్థానికులు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించాలని అధికారులు కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు