ఖజా, షారుక్ పాషా కుటుంబ సభ్యులతో కలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొన్న అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు​

​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కేంద్రంలో ముస్లింల పవిత్ర పండుగ ‘రంజాన్’ *(ఈద్-ఉల్-ఫితర్)* వేడుకలు శనివారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని వారి కుటుంబ సభ్యులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నెల రోజుల పాటు అత్యంత కఠినమైన ఉపవాస దీక్షలు (రోజా) పాటించిన ముస్లిం సోదరులు,దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో విరాజిల్లాలని అల్లాహ్‌ను ప్రార్థించడం, అయిజ ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉండటమే ఈ పండుగ అని ఆయన అన్నారు,
రంజాన్ మాసంలో పేదలకు సహాయం చేసేందుకు ‘జకాత్’, ‘ఫిత్రా’ రూపంలో ముస్లింలు చూపిన దానగుణం గొప్పదని ఆయన అన్నారు ,అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకోవడంతో పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదే కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్ బాబు, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్, మండల సోషల్ మీడియా అధ్యక్షుడు కోలా శశికాంత్ మరియు మెడికల్ అసోసియేషన్ జిల్లా నాయకులు కోర్లకుంట రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు