పినపాక మండలం ఏడుళ్ల బయ్యారం గ్రామంలో సోమవారం కార్పెంటర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కోయిలకుంట్ల రమణాచారి మాట్లాడుతూ కార్పెంటర్స్ అందరూ ఐక్యంగా ఉంటూ ఒకరికొకరు సహకరించుకోవాలని సూచించారు.
కార్పెంటర్ల వృత్తి అభివృద్ధి, ఎదురవుతున్న సమస్యలు, ప్రభుత్వ సహాయం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. కార్పెంటర్లకు ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు అందించాలని సభ్యులు కోరారు. అలాగే ఆధునిక పరికరాలు, శిక్షణ కార్యక్రమాలు అందించి వృత్తిని అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
సంఘం బలోపేతానికి సభ్యులంతా ఐక్యంగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు తంగెల్లపల్లి సురేష్, సింహాద్రి వీరభద్రం తదితర సభ్యులు పాల్గొన్నారు.
0 కామెంట్లు