అశ్వాపురం సమావేశం వాయిదా – 23కు మార్పు

అశ్వాపురం సమావేశం వాయిదా – 23కు మార్పు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురంలో నిర్వహించాల్సిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) సమావేశం వాయిదా పడింది. ఈ నెల 22 (ఆదివారం)న జరగాల్సిన ఈ సమావేశాన్ని 23 (సోమవారం)కు మార్చినట్లు తుడుందెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆల్లెం కోటి (నరేందర్) తెలిపారు.
ఏజన్సీ ప్రాంతాల్లో 5వ షెడ్యూల్ చట్టాలను ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా ఇటుక బట్టీలు ఏర్పాటు చేస్తున్నారనే అంశంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. అశ్వాపురం మండలంలో అక్రమంగా సాగుతున్న ఇటుక బట్టీలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో సర్పంచ్‌గా పనిచేసిన మర్రి మల్లారెడ్డి ఆదివాసీ చట్టాలను అతిక్రమించి అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, దీనిపై ప్రభుత్వం మరియు అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని ప్రశ్నించారు.
అదేవిధంగా, తుమ్మల చెరువు విషయంలో ఆదివాసీ సమాజానికి కల్పించిన హక్కులను పక్కనబెట్టి వ్యక్తిగత పెత్తనం కొనసాగుతున్నదని విమర్శించారు. 5వ షెడ్యూల్ చట్టాల అమలు, ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో 23న జరగనున్న అశ్వాపురం సమావేశానికి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ నాయకత్వం హాజరుకానుండగా, ఆల్లెం కోటి అధ్యక్షత వహించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనాలని తుడుందెబ్బ పిలుపునిచ్చింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు