గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద రూ.50 లక్షల వ్యయంతో గ్రామం నుంచి స్టేజీ వరకు రోడ్డు నిర్మాణానికి గతంలో మంజూరు అయిందని సర్పంచ్ తెలిపారు. అయితే, రోడ్డు భూమి పూజ, పనుల ప్రారంభం విషయంలో గ్రామ సర్పంచ్ అయిన తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క వార్డు మెంబర్ జేసీబీ ద్వారా పనులు ప్రారంభించారని ఆరోపించారు.
ఈ విషయాన్ని గమనించిన తాను, సమాచారం లేకుండా పనులు ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించగా, అక్కడే ఉన్న మహిళా వార్డు మెంబర్ తనపై దాడి చేసినట్లు సర్పంచ్ పుష్పలత పేర్కొన్నారు. అదే సమయంలో కావాలని ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకులు తన భర్తపై కూడా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
తాను ఒక మహిళా సర్పంచ్ అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఎమ్మెల్యే అండతో అధికార బలాన్ని ప్రదర్శించి దౌర్జన్యానికి పాల్పడటం అన్యాయమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడికి నిరసనగా బుల్డోజర్ ముందు కూర్చొని కొద్ది సేపు ధర్నా నిర్వహించారు.
ఇప్పటికైనా ఎమ్మెల్యే వంశీకృష్ణ తన పార్టీ నాయకులు, కార్యకర్తలకు గ్రామాల్లో శాంతియుత వాతావరణంలో పనిచేసేలా సూచనలు ఇవ్వాలని సర్పంచ్ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. రాజకీయాలు, పదవులు శాశ్వతం కాదని పేర్కొంటూ, ఇలాంటి ఘటనలు మానుకుని గ్రామాభివృద్ధికి అందరూ కలిసిమెలిసి పనిచేయాలని గ్రామస్తులకు ఆమె పిలుపునిచ్చారు.
0 కామెంట్లు