భీమవరం అడవి ప్రాంతంలో పులి అడుగుజాడలు గుర్తింపు


పినపాక మండలం టి.కొత్తగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని భీమవరం అడవి ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు ఆనవాళ్లు లభించాయి. గ్రామానికి సమీపంలోని కణితి ప్రసాద్ పొలం వద్ద పులి అడుగుజాడలను అటవీ అధికారులు గుర్తించారు.
అడవికి ఆనుకుని ఉన్న వ్యవసాయ భూముల వద్ద ఈ అడుగుజాడలు కనిపించడంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పులి కదలికలపై నిఘా ఉంచినట్లు అధికారులు తెలిపారు.
గ్రామ ప్రజలు రాత్రి వేళల్లో అడవి ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, పశువులను సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని సూచించారు. అవసరమైతే ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడతామని అటవీ అధికారులు పేర్కొన్నారు.
స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఆనవాళ్లు గమనించినా వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు