సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు... భాగ్యనగర్ తండాలో ఘనంగా నిర్వహణ

ఖమ్మం జిల్లా, సింగరేణి మండలం: భాగ్యనగర్ తండాలో బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహరాజ్ 287వ జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. యువ నాయకులు గుగులోత్ హారు నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సేవాలాల్ మహరాజ్ విగ్రహానికి పూలమాలలు అర్పించి, ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సేవాలాల్ మహరాజ్ అహింసా మార్గాన్ని బోధించిన మహనీయుడు అని, ఆయన చూపిన మార్గంలో యువత నడవాలని నాయకులు కోరారు. బంజారా సమాజ ఐక్యత, సంస్కృతి పరిరక్షణకు సేవాలాల్ మహరాజ్ ఆలోచనలు మార్గదర్శకమని ప్రసంగాల్లో తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జగన్ నాయక్, మాజీ సర్పంచ్ ఇస్లావత్ బన్సీలాల్, గుగులోత్ భగవాన్ దాస్, ఆలోత్ నందరాజ్, వార్డు సభ్యులు భూక్య కిషన్ నాయక్, గుగులోత్ నాగేశ్వరరావు, దేవి, మాజీ వార్డు సభ్యులు హనుమ నాయకులు మత్రియా, లచ్చు, జిత్త, బన్సీలాల్, లావుడియా రాంబాబు, భూక్య రాంకిషోర్, ధారవత్ కళ్యాణ్, భూక్య మోతీలాల్, పవన్, సురేశ్, రాజేష్, రాంజీ, వినోద్ నాయక్, ప్రవీణ్, శశిధర్, శ్రీనాద్, సాయి నాథ్, మురళి, వీరు, బాలు చౌహన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.#SantSevalalMaharaj
#SevalalMaharaj287Jayanti
#BanjaraCommunity
#BhagyanagarThanda
#KhammamDistrict
#SingareniMandal
#BanjaraCulture
#JayantiCelebrations
#YouthLeadership
#SBNews

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు