Subscribe Us

SB LATEST:

6, జనవరి 2026, మంగళవారం

రేపు రోడ్లపై పశువులను వదలొద్దు: ఈ బయ్యారం సెక్రటరీ జైపాల్ రెడ్డి



పినపాక మండలం ఈ బయ్యారం గ్రామంలో 69వ జాతీయస్థాయి కబడ్డీ పోటీలు ఉన్నందున రోడ్లపై పశువులను వదలవద్దని పశు యజమానులకు సెక్రటరీ జైపాల్ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన పినపాక మండలం ఈ బయ్యారంలో మాట్లాడారు. 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి క్రీడాకారులు అధికారులు హాజరవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన తెలియజేశారు. కావున పశు యజమానులు సహకరించాలని కోరారు. నేషనల్ మీట్ కబడ్డీ పూర్తయ్యే వరకు సహకరించాలని కోరారు. ఉన్నత అధికారులు ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు.