గుండాల మండలం జనవరి 5 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి
ఖమ్మం జిల్లాలో జరగనున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శతవసంతాల వేడుకల సన్నాహక సమావేశాన్ని పార్టీ కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు సమిష్టిగా జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే. సాబీర్ పాషా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీపీఐ పార్టీకి 100 సంవత్సరాల చరిత్ర ఉందని, దేశ స్వాతంత్ర్య పోరాటం నుంచి నేటి ప్రజా సమస్యల వరకూ నిరంతరం పోరాడుతున్న ఏకైక పార్టీ సీపీఐ అని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, వారి హక్కుల కోసం ఎల్లప్పుడూ పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.
సీపీఐ పార్టీ చేపడుతున్న ప్రజా ఉద్యమాలు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కుంజ బుచ్చయ్య, బొమ్మెర్ల లాలయ్య ఆదివారం నాడు జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా గారి చేతుల మీదుగా సీపీఐ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలు తమను ప్రభావితం చేశాయని, పార్టీ బలోపేతానికి అంకితభావంతో కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు సరిరెడ్డి పుల్లారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు రేసు ఎల్లయ్య, నాయకులు వాగబోయిన రమేష్, కొమరం హనుమంతు, ఎస్.కే. షాహిద్ శ్రీనివాస్, సాహెబ్, కుమార్, ఎస్.కే. సమీర్, బచ్చల రామయ్య, లక్ష్మయ్య, షబ్బీర్, నాసిర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
