పాల్వంచ :
పాల్వంచ పట్టణం జయమ్మ కాలనీలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి Battula Sumanth తన క్రీడా ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో మెరిసి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడు.
2025 డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 3 వరకు Nepal లో నిర్వహించిన అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొన్న సుమంత్, జనవరి 1న జరిగిన షాట్పుట్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పేదరికాన్ని అధిగమిస్తూ కృషి, పట్టుదలతో ఈ ఘనత సాధించడం అందరి ప్రశంసలను అందుకుంటోంది.
సుమంత్ విజయంలో Tokala Jagannadham Lakshmamma Seva Samithi (TJLSS) సంస్థ అందించిన ప్రోత్సాహం, COE క్యాంపస్, సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ అందించిన శిక్షణ కీలక పాత్ర పోషించాయి.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ TJLSS, కేటీపీఎస్ అధికారులు, ఉద్యోగులు, పట్టణ వ్యాపారులు, ప్రముఖులు అందించిన సహకారంతో సుమంత్ నేపాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని స్వర్ణ విజయం సాధించాడు. దాతల సహకారం, మార్గదర్శకత్వం, సుమంత్ అంకితభావం కలిసిన ఫలితమే ఈ గోల్డ్ మెడల్గా పలువురు పేర్కొన్నారు.
పేద కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో రాణించిన సుమంత్ విజయం ఆయన కుటుంబానికే కాకుండా, సహాయం చేసిన వారందరికీ గర్వకారణంగా నిలిచింది. ఈ స్వర్ణ విజయం పాల్వంచ పట్టణానికి, తెలంగాణ రాష్ట్రానికి మరింత ప్రతిష్టను తీసుకొచ్చింది.
