Subscribe Us

SB LATEST:

22, డిసెంబర్ 2025, సోమవారం

ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు పార్టీ నేతల సన్మానాలు

ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు పార్టీ నేతల సన్మానాలు
నాగర్ కర్నూల్,డిసెంబర్, 21,(ఎస్ బి న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన సర్పంచులను స్థానిక కాంగ్రెస్ నేతలుఅభినందనలు తెలిపారు. అందులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా పెద్దపేట నియోజకవర్గం లోని నూతన ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన సర్పంచ్ వార్డ్ సభ్యులను శాలువాల తో సన్మానం చేసి అభినందనలు తెలుపుతూ వారి పదవీకాలం పూర్తయ్యే వరకు గ్రామాలలో అభివృద్ధి వెళ్లి విజయాలని వారు ఆకాంక్షించారు.
సూర్య తండాలో మండల కాంగ్రెస్ కమిటీ సన్మానం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లోనిఉప్పునుంతల మండలం టీపీసీసీ ఉపాధ్యక్షులు, డిసిసి అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలను మండల కాంగ్రెస్ కమిటీఅభినందించింది.ఉప్పునుంతల మండలం సూర్య తండా గ్రామం గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మూడవత్ నారాయణ, డిప్యూటీ సర్పంచ్ మూడవత్ దేవేందర్‌లను అభినందించి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కట్ట అనంత రెడ్డి, వెల్టూరు మాజీ ఎంపీటీసీ రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ రామ్ సింగ్,
ప్రజాప్రతినిధులు గ్రామవార్డుసభ్యులు,స్థానిక కాంగ్రెస్,నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.