- మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య
మాజి జెడ్పిటిసి చండ్ర అరుణ.
- టిడిపి మండల అధ్యక్షులు తోలం సాంబయ్య
గుండాల గ్రామపంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తున్న
సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా
అభ్యర్థులను గెలిపించాలని గుండాల మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శనివారం నాడు గుండాల కేంద్రంలో గుండాల గ్రామపంచాయతీ సర్పంచ్ గా పోటీ చేస్తున్న ఈసం శ్రీను (శంకర్) ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ
గుండాల పురవీధుల గాడా అరుణోదయ డప్పు కళాకారుల ఆటపాటలతో ఓటర్లను ఓటు అడుగుతూ
ప్రజలు భారీ ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పాల్గొని మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలలో ఉమ్మడి గుండాల మండలంలో 8 పంచాయతీలకు పోటీ చేస్తున్నారని వారిని గెలిపించే బాధ్యత ప్రజలదేనని అన్నారు.
గుండాల గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా
ఈసం శ్రీను ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ గుండాల అభివృద్ధికి బాటన్న కోటన్న లింగన్న తోపాటు గుమ్మడి నరసయ్య అధికార పార్టీల వెంటబడి రోడ్డు సౌకర్యం కరెంటు సౌకర్యం కల్పించేందుకు ఎంతో కృషి చేశారని అన్నారు.
ఎన్నికల కోసం రంగులు మారుస్తూ అవకాశం దొరికితే సంపాదన
దేయంగా పనిచేస్తారని అట్లాంటి వారిపట్ల ఓటర్లు జాగ్రత్తగా ఆలోచన చేసి ఓటుతో
తిరస్కరించాలని కోరారు.
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పాల్గొని మాట్లాడుతూ, ఈసం శంకర్ అడవిలో పేరని ఊళ్లో ఈసం శ్రీను అని
ఈ సమాజం మారాలని దోపిడీ లేని సమాజం కావాలని అన్నల మాట అడవి బాట అని బాటన్నా లింగన్నతో
పని చేశాడని అన్నారు గుండాల గ్రామపంచాయతీ ప్రజలు చైతన్యం ప్రదర్శిస్తూ జనం కోసం పనిచేసే ఆదివాసి బిడ్డ
ఈసం శంకర్ ఎన్నికల గుర్తు ఉంగరం గుర్తుపై మీఅమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించి గెలిపించాలని ఓటరు మహాశయులకు విజ్ఞప్తి చేశారు.
మాజీ జెడ్పిటిసి చండ్ర అరుణ.
టిడిపి మండల అధ్యక్షులు తోలేం సాంబయ్య యువసేన అధ్యక్షులు ఎస్.కె ఆజాద్ లు మాట్లాడుతూ గుండాల గ్రామపంచాయతీలో గుండాల మండల కేంద్రం ప్రజా సమస్యలకు నిలయంగా ఉంటుంది కనుక బస్టాండు సంత డెవలపింగ్ గవర్నమెంట్ హాస్పటల్ పోస్టుమాటం గది డ్రైనేజీ కాలువలు ఇలా ఎన్నో సమస్యలు గుండాల గ్రామపంచాయతీలో ఉన్నాయి కనుక ఈ సమస్యలను పరిష్కరించాలంటే ప్రశనించే గొంతుక ఈసం శంకరన్న శ్రీను లాంటి నాయకుడు కావాలని గుండాల గ్రామ పంచాయతీ ప్రజలు కోరుకుంటున్నారు కనుక మాస్ లైన్ బలపరుస్తున్న అభ్యర్థి ఈసం శంకరన్న ఉంగరం గుర్తుపై గ్రామపంచాయతీ ప్రజలు అమూల్యమైన ఓటు వేసి ఈసం శంకరన్న ని గెలిపించాలని విజ్ఞప్తి.
ఈ కార్యక్రమంలో.
జిల్లా నాయకులు మాచర్ల సత్యం మండల కార్యదర్శి
కొమరం శాంతయ్య తెల్లం రాజు. సనప సుగుణ రావు మంగళ అప్పారావు. సనప కిషీందర్రావు.మంగళ నరసింహులు. ఊరికే బాబు పూనేం లక్ష్మయ్య. కోడూరు జగన్. వుకే బాబు. ఎస్ కే వసీం. డప్పు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
