రామచంద్రాపురం సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు వినతిపత్రం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రామచంద్రాపురం గ్రామపంచాయతీలో నెలకొన్న పలు అభివృద్ధి, మౌలిక వసతుల సమస్యల పరిష్కారం కోసం గ్రామ సర్పంచ్ భూరెడ్డి స్వాతి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు శనివారం వినతిపత్రం అందజేశారు. గ్రామంలో తాగునీటి సౌకర్యం, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, ఇతర మౌలిక వసతులతో పాటు గ్రామాభివృద్ధికి సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి దశలవారీగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు, స్థానిక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
0 కామెంట్లు