అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి: సీఐటీయూ

అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి: సీఐటీయూ
ఆదోని:ఆలూరు మండలం పెద్దహోత్తూరు గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త లేపాక్షి ఆత్మహత్యాయత్నానికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి. అంజిబాబు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి. నిర్మల డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఆదోనిలోని ఎన్‌టీఆర్ విగ్రహం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి వెంకటమ్మ అధ్యక్షతన ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, లేపాక్షి ఆత్మహత్యాయత్నానికి రాజకీయ వేధింపులే కారణమని ఆరోపించారు. వేధింపులకు పాల్పడిన వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

అంగన్వాడీ కార్యకర్తలు ఇప్పటికే యాప్‌ల సాంకేతిక సమస్యలు, అధికారుల ఒత్తిళ్లు, అధిక పనిభారం వంటి కారణాలతో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ వేధింపులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తల ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకుంటుండగా, ఇప్పుడు జిల్లాలోనూ ఇలాంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కార్యదర్శి తిప్పన్న, నాయకులు అజీమ్ ఖాన్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు గోవర్ధనమ్మ, వరలక్ష్మి, సరోజ, సోమక్క, రిజ్వానా, కరుణ, రంగం, ఆలూరు జ్యోతి, ఎబిషా రాణి, బాలరంగమ్మ, భాగ్యలక్ష్మి, శైలజ, నాగరాణి, విశాలాక్షి, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు