గ్రామసభల ద్వారానే సమస్యల పరిష్కారం: ఎంపీడీఓ వెంకటేశ్వరరావు

గ్రామసభల ద్వారానే సమస్యల పరిష్కారం: ఎంపీడీఓ వెంకటేశ్వరరావు

పినపాక, గురువారం: గ్రామాల సమస్యల పరిష్కారమే గ్రామసభల నిర్వహణ ముఖ్య ఉద్దేశమని ఎంపీడీఓ వెంకటేశ్వరరావు తెలిపారు. పినపాక మండలంలోని 23 గ్రామపంచాయతీలలో గ్రామసభలు నిర్వహించగా, పొట్లపల్లి, భూపాలపట్నం, జానంపేట తదితర గ్రామాల్లో జరిగిన సభలకు ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు వంటి పథకాల ద్వారా వేలాది మంది లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలో దాదాపు 60 వేల రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు.

గ్రామసభల ద్వారా గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించవచ్చని, ప్రతి రెండు నెలలకు ఒకసారి తప్పనిసరిగా గ్రామసభలు నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ గోపాలకృష్ణ, ఈసీ వీరభద్ర స్వామి, ఏఈ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు