రోడ్ సేఫ్టీ అవగాహన ర్యాలీ నిర్వహణ

 రోడ్ సేఫ్టీ అవగాహన ర్యాలీ నిర్వహణ
Sb  news పినపాక ప్రతినిధి:
రోడ్ సేఫ్టీ ప్రణాళికలో భాగంగా పినపాక మండలం తొగూడెం గ్రామంలో సర్పంచ్ పూణెం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ చేపట్టి వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

“హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడండి”, “మితి వేగం – సురక్షిత ప్రయాణం” వంటి నినాదాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అచ్చా నవీన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సతీష్, గ్రామస్తులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు