సెన్సస్ స్వీయ గణన మే 10లోపుపూర్తి చేయండి – తహసిల్దార్ ఖాసీం

సెన్సస్  స్వీయ గణన మే 10లోపు
పూర్తి చేయండి – తహసిల్దార్ ఖాసీం

గుండాల మండలం ఏప్రిల్ 28 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి

మండలంలోని ప్రతి కుటుంబం సెన్సస్–2027లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని తహసిల్దార్ ఖాసీం పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా మే 10 వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రజలు తమ కుటుంబ వివరాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్వయంగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. స్వీయ గణన విధానం ద్వారా ప్రజలే తమ వివరాలను నమోదు చేయడం వల్ల తప్పులు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మొబైల్‌కు “హెచ్” అక్షరంతో ప్రారంభమయ్యే 11 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య వస్తుందని తెలిపారు. మే 11 తర్వాత ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్‌కు ఆ సంఖ్యను చూపించాల్సి ఉంటుందని, ఆ నంబర్ ఆధారంగా నమోదు చేసిన వివరాలను ధృవీకరించి తుది సమర్పణ చేపడతారని చెప్పారు. అందువల్ల మండలంలోని ప్రజలందరూ స్వీయ గణనను సమయానికి పూర్తి చేసి ప్రభుత్వానికి సహకరించాలని తహసిల్దార్ ఖాసీం విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు