ఏటూరునాగారం, మార్చి 17 (మంగళవారం):
ఏటూరునాగారం మండల కేంద్రంలో బీజేపీ ఎన్నికల కమిటీ కన్వీనర్ గాడిచార్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో బీజేపీ మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు డా. జాడి రామరాజు నేత హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, మేధావులు, పత్రిక మిత్రులు ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఎం, సిపిఐ పార్టీలు దేశ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాయని విమర్శించారు.
అదేవిధంగా, అధికార కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వందేమాతరం గీతం పాడుతున్న సమయంలో అసెంబ్లీ నుండి బయటకు వెళ్లిన ఎంఐఎం ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
హిందూ సమాజం ఒక్కసారి ఆలోచించాలని, తమ సాంస్కృతిక విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. మత మార్పిడులను ప్రోత్సహిస్తున్న పార్టీలకు ప్రజలు మద్దతు ఇవ్వకూడదని అన్నారు.
గతంలో దేశం విదేశీ పాలనలోకి వెళ్లడానికి కారణమైన శక్తుల గురించి గుర్తుచేస్తూ, అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండాలంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, ఎంఐఎం పార్టీలను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీ యర్రల ఎల్లయ్య, బీజేపీ ఉపాధ్యక్షులు దుర్గం దుర్గారావు, జనగాం ఆనంద్ తదితర నాయకులు పాల్గొన్నారు.
0 కామెంట్లు