అశ్వాపురంలో డ్రగ్స్ స్మగ్లింగ్ భగ్నం… నలుగురు యువకులు అరెస్ట్.

అశ్వాపురంలో డ్రగ్స్ స్మగ్లింగ్ భగ్నం… నలుగురు యువకులు అరెస్ట్
-రూ.57,500 విలువైన గంజాయి స్వాధీనం.
అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని భగ్నం చేశారు. ఆదివారం సాయంత్రం ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో మండలంలోని గొల్లగూడెం వద్ద వాహనలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా భద్రాచలం నుండి మణుగూరు వైపు వెళ్తున్న కారును ఆపి పరిశీలించగా, అందులో గంజాయి తరలిస్తున్న హైదరాబాద్ కు చెందిన ముస్తాపూర్ రాహుల్, ముస్తాపూర్ ప్రశాంత్, బిత్తిరి విజయ్ కుమార్, యోగేంద్ర జాదవ్ లను అదుపులోకి తీసుకొని విచారించగా వారు మల్కాన్ గిరి జిల్లా కోరుకొండకు వెళ్లి అక్కడ నుండి  తమతో పాటుగా గంజాయిని తీసుకొని వస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు రూ.57,500 విలువైన ఒక కిలో 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని కారును సీజ్ చేసి కేసు నమోదు చేసి, నలుగురు యువకులను అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. గంజాయి కి సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే డయల్ 100కి గాని  అశ్వాపురం ఎస్ హెచ్ ఓ 8712682093 నెంబర్ కు సమాచారం  ఇవ్వాలని ఆయన కోరారు.. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ డ్రగ్స్ రవాణా పై కఠిన చర్యలు కొనసాగితాయని ఆయన హెచ్చరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు