శివదీక్ష స్వాములకు అన్నప్రసాద పంపిణీ

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 07 (ఎస్‌బి న్యూస్):
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓం నగర్ కాలనీలో శ్రీలలితా సహస్రనామ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శివదీక్ష స్వాములకు అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది.
ట్రస్ట్ 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ఓం నగర్ కాలనీ బోర్డు సమీపంలో శివదీక్ష స్వాములకు, కాలినడకన వెళ్తున్న శివభక్తులకు ప్రతిరోజూ మధ్యాహ్న సమయంలో మడితో కూడిన అన్నప్రసాదం, రాత్రి వేళ అల్పాహారం, పండ్లను పంపిణీ చేస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షురాలు మిడిదొడ్డి వరలక్ష్మి తెలిపారు.
ఈ నెల 12వ తేదీ వరకు ఈ సేవా కార్యక్రమం కొనసాగుతుందని, శివ స్వాములకు పండ్ల పంపిణీతో పాటు ప్రథమ చికిత్స కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. అన్నప్రసాదం, అల్పాహార వసతులను ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో అందజేస్తున్నారని తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9247425889 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, మహిళా భక్తులు, కాలనీవాసులు, శివదీక్ష స్వాములు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు