సిపిఎం నాయకులు కొమరం చిరంజీవి మృతి.... సంతాపం తెలిపిన సిపిఎం నాయకులు

 పినపాక మండలం బోటిగూడెం గ్రామానికి చెందిన సిపిఎం నాయకులు
కొమరం చిరంజీవి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలియగానే
సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ నిమ్మల వెంకన్న ఆధ్వర్యంలో
మృతదేహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి,
తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కార్యదర్శి దుబ్బ గోవర్ధన్,
కార్యదర్శి వర్గ సభ్యులు మడివి రమేష్, కల్తీ వెంకటేశ్వర్లు,
గ్రామపంచాయతీ సర్పంచ్ కామ్రేడ్ నూప బాపనమ్మ,
మండల కమిటీ సభ్యులు మడివి జోగయ్య, పూస పెద నరసింహారావు
తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు