అచ్చంపేట నియోజక వర్గ కేంద్రం నుండి లింగాల, దారారం క్యాంప్ రాయవరం, రాయవరం, వడ్డె రాయవరం, యాపట్ల మీదుగా కొల్లాపూర్కు బస్సు నడపాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధ వారం రోజు అచ్చంపేట డిఎంకు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు శంకర్ నాయక్ మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ చెప్పినప్పుడు బస్సు ఆ గ్రామాల మీదకు వెళ్ళింది పది రోజులకు బందు చేశారు. తదానంతరం ఆ గ్రామ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు వాహనంలో ఎక్కి రావాలంటే ఒక్కొక్క వాహనంతో చార్జీలు విపరీతంగా తీసుకుంటూ సామాన్యుడు ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది కావున ఎట్టి పరిస్థితుల్లో గ్రామాల మీదుగా బస్సు నడిపించాలని డిఎంను కోరారు. దారారం గ్రామ సర్పంచ్, క్యాంపు రాయవరం సర్పంచ్ ,రాయవరం సర్పంచ్, గ్రామ ప్రజల సంతకాల సేకరణ చేసి డిఎంకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఆ గ్రామాల మీదుగా కొల్లాపూర్ వరకు బస్సు నడపకపోతే గ్రామ ప్రజలచే ఆందోళన కార్యక్రమం చేపడతామని వారు అన్నారు. సిపిఎం మండల నాయకులు పిట్టల స్వామి మల్లయ్య లు ఉన్నారు.
0 కామెంట్లు