Subscribe Us

SB LATEST:

23, డిసెంబర్ 2025, మంగళవారం

రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలి : రాష్ట్ర వాడబలిజ సేవా సంఘం అధ్యక్షులు డర్ర దామోదర్

రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలి : రాష్ట్ర వాడబలిజ సేవా సంఘం అధ్యక్షులు డర్ర దామోదర్
పినపాక : పినపాక మండల పరిధిలోని పాత రెడ్డిపాలెం, వెంకట్రావ్ పేట గ్రామ పంచాయతీలకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు నాగకుమారి, సింధూజ కి మంగళవారం ఓడ బలిజ సంఘం ఆధ్వర్యంలో చిరు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్ , ఉపాధ్యక్షులు గగ్గురి రమణయ్య హాజరై ఎన్నికైన సర్పంచులకు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డర్ర దామోదర్ మాట్లాడుతూ వాడబలిజ సమాజ ఐక్యతను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని, రాబోయే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లోనూ అధిక మెజార్టీతో విజయం సాధించేలా సమిష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధి, స్థానిక పాలనలో ప్రజాసేవకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బొల్లె నరేష్, పినపాక మండల అధ్యక్షులు గగ్గురు ఖాదర్ బాబు, గ్రామ కుల పెద్దలు తోట నరసింహ, తోట రాంబాబు, వాజేడు మండల అధికార ప్రతినిధి బొల్లె ఆదినారాయణ, ములుగు జిల్లా ఇన్‌చార్జి ఆదినారాయణ, తోట రాజేష్, పానెం రామారావు, శ్రీకాంత్, తోట బాలకృష్ణ, పాపారావు, రాంబాబు, తోట రాజు, తోట బచ్చయ్య, తోట సూర్యం, సర్వేశ్వరరావు, సీతారాములు, కొప్పుల లక్ష్మణ్, ప్రవీణ్, సందీప్, హరీష్, యల్లయ్య, కన్నయ్య తదితర గ్రామస్థులు పాల్గొన్నారు.