*ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ తోసిపుచ్చారు. అరికెపూడి గాంధీ, మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ లపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్ ఈ తీర్పును వెలువరించారు. ఆయా ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు చూపలేకపోయారని స్పీకర్ తన తీర్పులో స్పష్టం చేశారు. సాంకేతకంగా ఆయా ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు స్పీకర్ పేర్కొన్నారు*.
కాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్ లపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ గురువారం తీర్పు ఇవ్వనున్నారు. అదేవిధంగా దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. స్పీకర్ నోటీసులకు జవాబు ఇచ్చేందుకు తమకు గడువు కావాలని దానం, కడియంలు అభ్యర్థించారు. వీరి వివరణ తర్వాత స్పీకర్ తన తీర్పును వెలువరించనున్నారు.
