పినపాక
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
చేపడుతున్న ఇంటింటి జనగణన, ఇంటి గణన సర్వేను పకడ్బందీగా చేపట్టాలని పినపాక తహసిల్దార్ గోపాలకృష్ణ సూచించారు. బుధవారం పినపాక మండల పరిధిలోని గోపాలరావుపేట, పినపాక, ఈ బయ్యారం గ్రామాల పరిధిలో పరిధిలోని పలువురి ఇం డ్లకు వెళ్లి సమగ్ర సర్వేను పరిశీలించి స్వయంగా డోర్లకు స్టిక్కర్లను అతికించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులగణన సర్వేకు ప్రజలందరూ సహకరించి పూర్తి వివరాలు అందజేయాలని కోరారు. పూర్తిగా ఉపాధ్యాయులతో , ప్రభుత్వ అధికారులతో ఈ సర్వే నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ సర్వే వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
