దుప్పి మాంసం పట్టివేత....ఒకరిపై కేసు నమోదు

అశ్వాపురం:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మిట్ట గూడెం గ్రామపంచాయతీ పాయం మంగయ్య గుంపు గ్రామంలో దుప్పి మాంసం విక్రయిస్తుండగా ఓ ఇంటిపై ఫారెస్ట్ అధికారులు దాడులు నిర్వహించి దుప్పి మాంసాన్ని విక్రయిస్తున్న సప్క వీరస్వామి  ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు 10 కిలోల మాంసం, దుప్పి తల, కాళ్లు స్వాధీనం చేసుకొని వీరస్వామి పై కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.ఈ దాడులలో  ఎఫ్ఎస్ఓ నాగరాజు తో పాటు ఎఫ్డిఓ ధనుంజయ, బీట్ ఆఫీసర్ సునీల్  పాల్గొన్నారు.