Subscribe Us

SB LATEST:

5, నవంబర్ 2025, బుధవారం

అక్రమ సంబంధం నే పథ్యం లో వేట కొడవళ్ళతోదాడి- ముగ్గురికి తీవ్ర‌గాయాలు

అక్రమ సంబంధం నే పథ్యం లో వేట కొడవళ్ళతోదాడి
- ముగ్గురికి తీవ్ర‌గాయాలు
నాగర్ కర్నూల్,(ఎస్ బి న్యూస్): అక్రమ సంబంధం నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లాకల్వకుర్తి మునిసిపాలిటీ పరిధిలోని సంధ్యాపూర్ గ్రామంలో బుధవారం సాయంత్రం దారుణం జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ కుటుంబ సభ్యులపై కోడలు కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలలోకి వెళితే కల్వకుర్తి మునిసిపాలిటీ పరిధిలోని సంజాపూర్ గ్రామానికి చెందిన గుర్రం మల్లేష్ కు వెల్దండ మండలం చెరుకూరు గ్రామానికి చెందిన శిరీషతో సంవత్సరంన్నర క్రితం వివాహం అయ్యింది. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. కాగా వీరికి వివాహానికి ముందే మల్లేష్ కు సిల్లార్ పల్లి గ్రామానికి చెందిన ఓ యువతి తో వివాహేతర సంబంధం కొనసాగుతూ వచ్చింది. ఈ విషయం తెలిసి పలుమార్లు పెద్దల సమక్షంలో ఇరువురికి నచ్చ చెప్పారు. కానీ ఫలితం లేకపోయింది. మూడు నెలల క్రితం మల్లేష్ ఆ యువతితో కలిసి వెళ్లిపోయాడు. అప్పటినుండి శిరీష తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. మూడు నెలలైనా మల్లేష్ ఆచూకీ దొరకకపోవడంతో శిరీష కుటుంబ సభ్యులు సంజాపూరుకు వచ్చారు. మల్లేష్ తండ్రి జంగయ్య, తల్లి అలివేలు, తమ్ముడు పరమేశ్ తో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య మాట మాట పెరగడంతో శిరీష కుటుంబ సభ్యులు ఆగ్రహించి గొడ్డలితో జంగయ్య, అలివేలు, పరమేష్ పై దాడికి పాల్పడ్డారు. జంగయ్య, పరమేష్ పరిస్థితి విషమంగా ఉండడం, అలివేలుకు కూడా తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి సమాచారం చేయడంతో పోలీసులు వెంటనే సంజాపూర్ కు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.