గుండాల మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం.

గుండాల మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం.

 గుండాల మండలం ఆగస్టు 10 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి
        
ఆదివాసులకు ప్రత్యేకమైన రోజు ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి గుర్తించినప్పటికీ ఆదివాసులకు రాజ్యాంగంలో చట్టాలు అమలు జరగటం లేదు. అవి కచ్చితంగా అమలు చేయాలని, ప్రపంచ ఆదివాసి దినోత్సవ రోజున గుర్తు చేస్తూ,  ఆదివాసుల హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వజ్జ ఎర్రయ్య, ఆదివాసి సంక్షేమ పరిషత్ గుండాల మండల అధ్యక్షులు పూనేం రమణబాబు అధ్యక్షతన నిర్వహించగా ఈ కార్యక్రమంలో కొమరంభీమ్ విగ్రహానికి పూలమాలవేసి జెండా ఆవిష్కరించి  అనంతరం గుండాల సర్పంచ్ కోరం సీతారాములు  మాట్లాడుతూ, ఆదివాసి చట్టాలు 1/70, పీసా చట్టం ఉన్నప్పటికీ అవి పూర్తిస్థాయిలో ఆదివాసులకు అమలయేల ప్రభుత్వాలు అధికారులు పనిచేయడం లేదని ఆరోపించారు వీటి అమలు సాధనకై పోరాడుతామని అన్నారు, అలాగే మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి ఈసం శంకర్ మాట్లాడుతూ, ఆదివాసి చట్టాలు అమలుపై అందరూ కలిసి పనిచేయాలని సూచించారు తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు పూణెం శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రపంచంలో ఉన్నటువంటి 70 దేశాల్లోని ఆదివాసులకు ఇంకా పూర్తిస్థాయిలో ఆదివాసి చట్టాలు అమలు కావటం లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో లింగగూడెం సర్పంచ్ చింత వెంకటేశ్వర్లు ముత్తాపురం సర్పంచ్ కల్తి రాధా ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు వాగబోయిన చంద్రయ్య దొర  మండల నాయకులు పెండకట్ల మహేందర్ నాగరాజు తుడుం దెబ్బ మండల అధ్యక్ష కార్యదర్శులు గోవింద నరసింహ రావు మోకాల మహేందర్ జిల్లా నాయకులు ఈసం సాంబయ్య కల్తీ వసంతరావు ఊకె రవికుమార్ ఆదివాసి ట్రైబల్ ఫోరం నాయకులు, ఈసం కృష్ణ సిపిఎం మండల నాయకులు ఓకే వెంకటేశ్వర్లు, బిజెపి మండల అధ్యక్షులు సోలం సతీష్,బిఆర్ఎస్ జిల్లా నాయకులు మోకాళ్ళ వీరస్వామి, టీజేఎస్ మండల అధ్యక్షులు గొల్లపల్లి రమేష్, ఆదివాసి ఉద్యోగుల సంఘం నాయకులు పెండకట్ల సత్యం జోగపోతయ్య,అరేం నరేష్ గడ్డం లాలయ్య యాసరపు వెంకన్న ఈసం కృష్ణ కల్తీ లక్ష్మణ్ పూనేం వసంతరావు గొగ్గల సుధాకర్ మరియు విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు