నవచైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా యువజన సమ్మేళనం
గుండాల మండలం ఆగస్టు 3 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి:
యువత స్నేహభావంతో పాటు సేవా దృక్పథాన్ని పెంపొందించుకుని సమాజాభివృద్ధికి తోడ్పడాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గుండాల మండల కేంద్రంలో నవచైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన యువజన సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలోని యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నవచైతన్య యువజన సంఘం గతంలో అనేక సేవా కార్యక్రమాలు, సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహించి ప్రజల ప్రశంసలు అందుకుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. యువత ఐక్యంగా ఉంటే
సమాజంలో ఉన్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనవచ్చని అన్నారు. ప్రస్తుతం కొంతమంది యువకులు మద్యం, మాదకద్రవ్యాల వంటి వ్యసనాలకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వ్యసనాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, సేవా కార్యక్రమాల వైపు యువత అడుగులు వేయాలని సూచించారు. యువతలో
స్నేహబంధం, సామాజిక బాధ్యత పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తరించాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమనికి పాత్రికేయులు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.
0 కామెంట్లు