తెలంగాణ రాష్ట్ర ఉపసర్పంచ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన గాండ్ల సురేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపసర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన అచ్చా నవీన్లు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎమ్మెల్యేను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా పాయం వెంకటేశ్వర్లు నూతన నాయకులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ఉపసర్పంచ్ల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తమవంతు సహకారం అందించాలని కోరారు.గాండ్ల సురేష్, అచ్చా నవీన్ మాట్లాడుతూ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఉపసర్పంచ్ల హక్కుల సాధన, గ్రామ పంచాయతీల బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు.కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పిరినాకి నవీన్, టౌన్ ప్రెసిడెంట్ కుర్రం రవి, ఆత్మ కమిటీ సభ్యుడు ఆవుల సర్వేశ్వరరావు, సోషల్ మీడియా కోడి అశోక్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
0 కామెంట్లు