విద్యార్థుల హాజరు, చదువుపై తల్లిదండ్రులకు అవగాహన సమావేశం

విద్యార్థుల హాజరు, చదువుపై తల్లిదండ్రులకు అవగాహన సమావేశం
గుండాల, జులై 18 (ఎస్‌బి న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని ఎంపీపీఎస్, జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలల్లో శనివారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల చదువు, హాజరు శాతం, పరీక్షల ఫలితాలు, ప్రభుత్వ విద్యా కార్యక్రమాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

విద్యార్థులు ప్రతిరోజూ తప్పనిసరిగా పాఠశాలకు హాజరయ్యేలా చూడడంతో పాటు ఇంటి వద్ద కూడా చదువుకు ప్రోత్సహించాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులను కోరారు. పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని మండల విద్యాశాఖ అధికారి కే. పార్వతమ్మ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయులు బి. రమేష్, ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాళ్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు