విద్యార్థులే దేశ భవిష్యత్తు.. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: డీఎస్పీ రవీందర్ రెడ్డి

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి – డీఎస్పీ రవీందర్ రెడ్డి
మణుగూరు, జూన్ 23 (ఎస్‌బి న్యూస్ ప్రతినిధి):
మణుగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు.

మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యంతో పాటు భవిష్యత్తు కూడా దెబ్బతింటుందని, ఎవరైనా అనుమానాస్పదంగా మాదకద్రవ్యాల విక్రయాలు లేదా వినియోగం చేస్తున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ స్వర్ణజ్యోతి, ప్రధానోపాధ్యాయురాలు జి. నాగశ్రీ, సీఐ నాగబాబు, ఎస్సై రవూఫ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
#Manuguru #DSPRavinderReddy #DrugFreeSociety #AntiDrugsAwareness #ZPHSManuguru #SBNews #BhadradriKothagudem #StudentsAwareness #TelanganaPolice #DrugFreeYouth

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు