జీలుగు పంటల సాగుతో భూసారం పెరుగుతుంది: అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు

జీలుగు పంటల సాగుతో భూసారం పెరుగుతుంది: అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు
జీలుగు పంటల సాగుతో భూసారం పెరుగుతుందని అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు అన్నారు.
పినపాక మండలం ఉప్పాక గ్రామంలో, నిర్వహించిన రైతు సమావేశంలో పినపాక వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. జీలుగు పంటలను సాగు చేయడం వల్ల భూసారం పెరగడంతో పాటు నేలలో సేంద్రియ పదార్థాల శాతం మెరుగుపడుతుందని తెలిపారు. పంటల మార్పిడి విధానంలో జీలుగు పంటలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దిగుబడులు పెంచుకోవచ్చని సూచించారు.

రైతులు శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తూ వ్యవసాయం చేయాలని, వ్యవసాయ శాఖ అందిస్తున్న సలహాలు, సేవలను సద్వినియోగం చేసుకోవాలని వెంకటేశ్వర్లు కోరారు. సమావేశంలో గ్రామ రైతులు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు