భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం–చర్ల ప్రధాన రహదారి నుంచి రాజుపేటకు వెళ్లే మూల మలుపు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
సమాచారం ప్రకారం, కారు నడుపుతున్న సమయంలో డ్రైవర్కు ఒక్కసారిగా కళ్లు తిరగడంతో వాహనం అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు కారులో ప్రయాణిస్తున్న వారెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. వాహనం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ అందరూ సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ ఘటనతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొన్నప్పటికీ అనంతరం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది.
#Bhadrachalam #CharlaRoad #RoadAccident #Rajupeta #BhadradriKothagudem #CarAccident #TelanganaNews #SBNews 🚗🚨🌳
0 కామెంట్లు