బోటుగూడెం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కార్మికులకు అవసరమైన సామాగ్రిని సర్పంచ్ నూప బాపనమ్మ, ఉప సర్పంచ్ ధన లక్ష్మి, గ్రామ సెక్రటరీ జ్యోతి, వార్డ్ సభ్యులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాభివృద్ధితో పాటు కార్మికుల జీవనోపాధికి తోడ్పాటు అందుతుందని తెలిపారు. కార్మికులు భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పనులు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, కార్మికులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
0 కామెంట్లు